ప్రజా స్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను కాపాడుకుందాం

  • ఏబిఎన్ విలేకరిపై దాడిని ఖండిస్తూ ఏ.పి.యు.డబల్ యు.జె కళ్యాణదుర్గం శాఖ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులు, న్యూస్ రిపోర్టర్లు నిరసన

కళ్యాణదుర్గం నియోజకవర్గం: రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం అనే సభలో వైసిపి కార్యకర్తలు, నాయకులు ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై చేసిన దాడికి వ్యతిరేకంగా ఏ.పి.యు.డబల్ యు.జె కళ్యాణదుర్గం శాఖ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులు, న్యూస్ రిపోర్టర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన నాయకులు మీడియా వారిపై జరిగిన ఈ దాడిని పూర్తిగా ఖండిస్తూ, ఈ నిరసన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతును తెలియజేశారు. తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులతో కలిసి జనసేన నాయకులు డివిజన్ ఆర్టీవో మరియు పట్టణ సీఐ గారికి మెమోరాండం ఇచ్చారు. భవిష్యత్తులో మీడియా వారిపై ఇలాంటి దాడులు మళ్లీ పునరావృతం అయితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శులు నరసయ్య, జనసేన జిల్లా జాయింట్ సెక్రెటరీ మరియు (జె ఎస్పీ-టీడీపీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్) బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన వీరమహిళ షేక్ తార, కళ్యాణదుర్గం జనసేన పట్టణ ఉపాధ్యక్షులు వంశీ, కళ్యాణదుర్గం రూరల్ జనసేన మండల అధ్యక్షులు జాకీర్, శెట్టూరు జనసేన మండల అధ్యక్షులు కాంత్ రాజు, కళ్యాణదుర్గం జనసేన పట్టణ నాయకులు కార్తీక్, అనిల్, రహుల్ల జనసైనికులు పాల్గొన్నారు.