ఆర్టీసీ మేనేజర్ కు ధన్యవాదాలు తెలిపిన జనసేన నాయకులు

కొండెపి: ఇటీవల కాలంలో ముండ్లమూరివారిపాలెంలో ఆర్టీసీ బస్సుని ఆపీ, విద్యార్థుల కోసం చెరుకూరు, ముండ్లమూరివారిపాలెం, సుంకిరెడ్డిపాలెం, పెరిగిపాలెం గ్రామ ప్రజలు ధర్నా చేయడం జరిగింది. గత నాలుగు రోజుల నుండి విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా బస్సు సరైన సమయానికి బస్సు రావడం జరుగుతుంది. మనందరికీ విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం, గ్రామ ప్రజలు మరియు విద్యార్థుల సమస్యను అర్థం చేసుకుని కందుకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సరైన సమయానికి బస్సును పంపించడం జరిగింది. కావున విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలందరి తరఫున ఆర్టీసీ డిపో మేనేజర్ కు జనసేన నాయకులు ధన్యవాదాలు తెలుపుకున్నారు.