అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా జనసేన నాయకులు

  • అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్దం

అమలాపురం రూరల్ మండలం, ఈదరపల్లిలో శనివారం తెల్లవారుజామున 4 గంటలకు మద్దింశెట్టి రాంబాబుకు చెందిన తాటాకుఇల్లు అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో వారు సర్వస్వం కోల్పోయారు. ఆపరేషన్ నిమిత్తం అప్పుగా తెచ్చుకున్న డబ్బులు అగ్నిలో కాలిపోయి బూడిద అయిపోయాయని, రోడ్డున పడ్డామని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొప్పుల నాగమానస, తెలుగుదేశం నాయకులు అడపా సత్తిబాబు చేరుకున్నారు. అగ్ని బాధితుల కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా నాగ మానస మాట్లాడుతూ.. జనసేన పార్టీ తరపున వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.