జనసేనలో చేరికలు

పొన్నూరు నియోజకవర్గం చింతలపూడి గ్రామ వాస్తవ్యులు మాదాసు అప్పారావు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సమక్షంలో జనసేన పార్టీలో చేరటం జరిగింది. జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ ల సమక్షంలో మాదాసు అప్పారావుతో భారీ సంఖ్యలో వచ్చిన నాయకులు, కార్యకర్తలకు మెడలో కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. గతంలో వీరు అందరూ అధికార పార్టీ వైసిపిలో ప్రధాన భూమిక పోషించిన వారు ఇప్పుడు వీరు అందరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనపార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రచార కమిటీ కో-ఆర్డినేటర్ శిఖా బాలు, జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, మేకల రామయ్య యాదవ్, అప్పారావు, సూర్య, పొన్నూరు టౌన్ అధ్యక్షులు కరిముల్లా, పొన్నూరు మండల అధ్యక్షులు నాగిశెట్టి సుబ్బారావు, చేబ్రోలు మండల అధ్యక్షులు చందు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.