రాజంపేట ఎంపీ అభ్యర్థికి ఘన స్వాగతం పలికిన జనసేన నాయకులు

మదనపల్లె: రాజంపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. శనివారం ఉదయం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు దగ్గర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జనసేన, తెలుగుదేశం పార్టీల రాజంపేట పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి దుశ్యాలువతో సన్మానించి, పుష్పగుచ్చం అందచేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చీకలబయలు నుండి కలికిరి వరకు ర్యాలీగా జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలు గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, తాళ్ల గిరి, సురేష్, ప్రతాప్, హేమంత్, రూరల్ ఉపాధ్యక్షులు కుమార్, చంద్రశేఖర, వీర మహిళలు రూరల్ ప్రధాన కార్యదర్శి రెడ్డెమ్మ, టౌన్ సెక్రటరీ పద్మావతి, సెక్రటరీ నాగవేణి, రూరల్ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్, ఐటీ విభాగ నాయకులు కల్లూరు లక్ష్మినారాయణ, రాజారెడ్డి, జయ, పట్టణ సెక్రటరీ జనార్దన్, లవన్న, చంద్ర తదితరులు పాల్గొన్నారు.