కళ్యాణదుర్గంలో జనసేన, టిడిపి ఇంటింటా ఉమ్మడి ప్రచారం

కళ్యాణదుర్గం నియోజకవర్గం: జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ చౌదరి జనసేన, టిడిపి ఉమ్మడిగా ఇంటింటా ప్రచారం కళ్యాణదుర్గం పట్టణ మున్సిపాలిటీలోని మారంపల్లి కాలనీలో జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ సూచనలతో కళ్యాణదుర్గం మండల అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు లక్ష్మీ నరసయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరపున కళ్యాణదుర్గం నియోజకవర్గ వీరమహిళల ఇంచార్జ్ షేక్ తార, కళ్యాణదుర్గం మండల వీరమహిళల ఇంచార్జ్ మమత, కళ్యాణదుర్గం పట్టణ వీరమహిళల ఇంచార్జ్ కల్పన, పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, ముఖ్య నాయకులు రాజు, చిత్తప్ప, సుధాకర్, మహేష్, దేవా, రుహుల్ల, లోకేష్ తదితరులు పాల్గోన్నారు.