వాలంటీర్లను తప్పించి సచివాలయ సిబ్బందితో పెన్షన్లను అందించాలని వినతి

జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ ఆర్ పురం మండలం నందు వృద్ధులకు, వికలాంగులకు, ఇతర పెన్షన్ దారులకు, వాలంటీర్లను తప్పించి సచివాలయ సిబ్బందితో పెన్షన్లను అందించాలని ఎస్ఆర్ పురం మండల ఎం.పీ.డీ.వోకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్లను తప్పించి సచివాలయ సిబ్బందులతో పెన్షన్లను పంచాలని మరియు వాలంటీర్ల నుండి సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు, మొదలగునవి స్వాధీనం చేసుకోవాలని మంగళవారం ఎస్ఆర్ పురం మండలం నందు ఎం.పీ.డీ.వోకి వినతిపత్రం అందజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షలు గంధమనేని జయశంకర్ నాయుడు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిరంజీవి, బిజెపి పార్టీ మండల అధ్యక్షులు జెల్ల జ్యోతి రెడ్డి, జీడీ నెల్లూరు నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ రాజేంద్రన్, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కంజేరి చంద్రశేఖర, టిడిపి మండల కార్యనిర్వాహక కార్యదర్శి సిద్దయ్య శెట్టి, టిడిపి సీనియర్ నాయకులు పుల్లూరు దాము.గంధమనేని నరేష్, మంగుంట ఎక్స్ సర్పంచ్ భూపతి రెడ్డి కలిసి వినతి పత్రం అందచేయడం జరిగింది.