జనసేన-తెలుగుదేశం-బిజెపిని భారీ మెజారిటీతో గెలిపించాలి

పాలకొండ, సీతంపేట మండలం, కుమ్మరిగండి, తాళాడ గ్రామాల్లో మహా కూటమి ప్రచారంలో భాగంగా జనసేన-తెలుగుదేశం-బిజెపి కూటమికి చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణని మరియు కూటమి బలపరిచిన భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతని భారీ మెజారిటీతో గెలిపించాలని, ఇంటింటి ప్రచారంలో జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు మొజోరు తేజోవతి, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి తాడంగి సునీత ఓతర్లను అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.