రాజంపేటలో జోరుగా కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట

  • పవనన్న ప్రజాబాట 86వ రోజు

రాజంపేట నియోజకవర్గం, ఊటుకూరు పంచాయతీ పరిదిలోని వెంకట్ రాజంపేట, వెంకట్రాజంపేట అరుంధతి వాడ, హరిజనవాడ, అలాగే గుండ్లూరు పంచాయతీ పరిదిలోని పలు గ్రామాలైన శంకరాపురం, రామాపురంలో పవనన్న ప్రజాబాట 86వ రోజు కార్యక్రమాన్ని అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన నాయకులు ముందుకు తీసుకు వెళ్లడం జరిగింది. అక్కడ ఉండే గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కరెంట్ బిల్లులు సామాన్లు రేట్లు పెంచి మా రక్తం తాగుతున్నారని, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర్ పంతులు పోలిశెట్టి శ్రీనివాసులు, వీరయ్య ఆచారి, హేమంత్, జనసేన వీరమహిళలు జెడ్డా శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు.