నాడు కోడి కత్తి- నేడు గులక రాయి- ప్రజలు గమనిస్తున్నారు జగన్ రెడ్డి!

  • మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల

కోనసీమ జిల్లా: నాడు కోడికత్తి డ్రామా.. నేడు గులకరాయి… అయినా మీకు వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం అంటూ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనంద రావు అన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. జగన్ హత్య యత్నం అంటూ వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాను. నాలుగు సార్లు పవర్ కట్ అయ్యింది. ముఖ్యమంత్రి పర్యటన లో ఈ విధంగా నిర్లక్ష్యం వహించిన విద్యుత్ అధికారులును సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుల్లెట్ ప్రూఫ్లు అడ్డుపెట్టక పోవడానికి కారణం ఏమిటి. వెంటనే పోలీస్ ఉన్నతా ధికారులను విధుల నుంచి తప్పించాలని అనందరావు అన్నారు. వైసీపీ కు చెందిన అవుతు శ్రీధర్ రెడ్డి నాలుగు రోజుల్లో సంచలనం అవుతుందని చెప్పాడు. ముందుగా ఎలా తెలిసింది. దాడి జరిగిన 10 నిమిషాల్లో ప్ల కార్డ్స్ తో నినాదాలు ఎలా చేయగలిగారు అని అనందరావు ప్రశ్నించారు. గొడ్డలి పోటును గుండె పోటుగా మార్చిన వ్యక్తులు కు ఈ సంఘటన పెద్ద వింత కాదన్నారు. ఈ సమావేశం లో అల్లాడ స్వామినాయుడు, తిక్కిరెడ్డి నేతాజీ, కంచిపల్లి అబ్బులు, గారపాటి మార్తండ, తాళబత్తుల అప్పలాచార్య లు, ఆవుపాటి గోపాలం, చేబ్రోలు నాగేశ్వర రావు, వల వల శివరావు, కంచిపల్లి అబ్బులు తదితరులు పాల్గొన్నారు.