ప్రగతీ నగర్ లో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశం

నరసాపురం నియోజకవర్గం నుండి ఉద్యోగ మరియు వ్యాపార రీత్యా హైదరాబాద్ లో నివసిస్తున్న జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలతో శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కళావేదిక, ప్రగతీ నగర్, హైదరాబాదు నందు ఆత్మీయ సమావేశం నిర్వహించి, రాబోయే ఎన్నికల్లో వారి మద్దతు కోరిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు, బీజేపీ ఇంఛార్జి పులపర్తి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీ కృష్ణ(చిన్న). అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ హైపర్ ఆది, మాజీ కేంద్ర మంత్రి ఉప్పలపాటి కృష్ణంరాజు మేనల్లుడు నరేంద్ర వర్మ, కూకట్పల్లి జనసేన ఇంఛార్జి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, వినోద్ వర్మ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.