కక్కె కేశన్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఏపీ శివయ్య

పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల ‌మండలం, చుక్కావారిపల్లె గ్రామంలో ఆకస్మికంగా మృతి చెందిన ఐరాల మండల జనసేన పార్టీ అధ్యక్షులు కక్కె పురుషోత్తం తండ్రి గారైన కక్కె కేశన్న భౌతికకాయంను ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఐరాల‌ మండల పార్టీ అధ్యక్షులు గిరిధర్ బాబు, ఐరాల మండలం క్లస్టర్ ఇంఛార్జ్ మురళి, పార్లమెంటు కార్యదర్శి దేవాజీ, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు లతా బాబునాయుడు, నాంపల్లి సర్పంచ్ స్వర్ణ, కాణిపాకం మాజీ సర్పంచ్ మాధుసూదన్ రావు, పూల ప్రభాకర్, ముని రాజా, సానే రమేష్, వేదగిరివారిపల్లె సర్పంచ్ ప్రశాంత్, మండల ప్రధాన కార్యదర్శి వాసు రాయల్, మాజీ వార్డు సభ్యులు జి చంద్రమౌళి మరియు బీసీ సెల్ మండల ఉపాధ్యక్షులు వై దామోదరం గోపాల్ వారి పల్లి ఓబులవారిపల్లి గ్రామ పెద్ద బాలకృష్ణ బాలకృష్ణ మరియు జనసేన యువనాయకులు కిషోర్ చెల్లె హరిప్రసాద్, చెల్లె శివ రాయల్, పద్మనాభం జయచంద్ర మరియు చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొన్నారు.