బెదిరింపులతోనే వైసిపి గెలిచింది: పవన్

అమరావతి: బెదిరింపుతోనే వైసిపి ఎక్కువ స్థానాల్లో గెలిచిందని జనసేనాని పవన్‌ ఆరోపించారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై ఆదివారం ఆయన స్పందిస్తూ.. పైన పేర్కొనట్లు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో వైసిపి అభ్యర్థులు తమకు ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించారని, రేషన్‌కార్డులు, పింఛన్లు, విద్యా పథకాలు ఆపేస్తామని బెదిరించారని అన్నారు.