శ్రీవారిని దర్శించుకున్న లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా..

రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీకి వచ్చిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తిరుమల శ్రీవారిని దర్శంచుకున్నారు. స్పీకర్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు ఆలయ పూజారులు, అధికారులు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన స్పీకర్ ఓం బిర్లా తిరుమల బాలాజీ కోట్ల హిందూవుల ఆరాధ్యదైవమని అన్నారు. కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని ఆశీస్సులు పోందడం చాలా సంతోషంగా ఉందని..దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు.ఇక కరోనా నుంచి ప్రజలకు త్వరలో విముక్తి కలిగించాలని కూడా స్వామి వారిని కోరుకున్నాని అన్నారు. స్వామి వారి ఆశీస్సులు దేశంపై మనపై ఉండాలని,దేశం మరింత అభివృద్ధి చేందాలని కోరుకున్నట్లు తెలిపారు. భక్తులకు టిటిడి అన్ని సౌఖర్యాలు సంతృప్తిగా చేయడం ఆనందంగా ఉందని.. స్వామి వారి కృపతో దేశం కోసం ఎటువంటి సేవ చేసేందుకైనా తాను సిద్దంగా ఉన్నానని తెలిపారు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా.