విద్యుదాఘాతానికి కాలిపోయిన ఇళ్ళ పునర్నిర్మాణానికి సాయమందించిన శ్రీకాకుళం జనసేన నాయకులు సర్వేశ్వర రావు

శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకూర్మం పంచాయితీ నగరాలపేట గ్రామానికి చెందిన నండ అచ్చమ్మ , నండ గణేష్ మరియు నండ తాతారావుకు సంభందించిన 3 పూరిల్లు విద్యుత్ తీగల తాకిడి వల్ల దగ్ధం కావడం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ సర్వేశ్వర రావు గారు నూతన గృహ నిర్మాణల కోసం తన వంతుగా 100 సిమెంట్ బస్తాలు సహాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గురు ప్రసాద్, ఉదయ్ శంకర్, గొంటిశ్రీను మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు..