Chittoor: శ్రీ కోడి చంద్రయ్యను మర్యాద పూర్వకంగా కలసిన బీజేపీ, జనసేన నాయకులు

చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జనసేనపార్టీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి విగేష్ కుమార్ కు “కమలం” గుర్తుపై ఓట్లేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ… సంక్రాంతిపల్లిలోని జనసేనపార్టీ సీనియర్ నాయకుడు శ్రీ కోడి చంద్రయ్య గారిని మర్యాద పూర్వకంగా కలసి బీజేపీ, జనసేన నాయకులు అనుసరించాల్సిన వ్యూహాలు గురించి చర్చించారు. ఈకార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ సెల్ సభ్యులు రవికుమార్, బీజేపీ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు పోతపాల రామమూర్తి, బీసీ నేత అట్లూరి శ్రీనివాస్, జనసేనపార్టీ నాయకులు పుంగనూరు నానబాల లోకేష్ రాయ్ తదితరులుపాల్గొన్నారు.