సావిత్రి బాయ్ ఫూలేకు నివాళులర్పించిన తణుకు జనసేన

సావిత్రి బాయ్ ఫూలే జయంతి సందర్భంగా తణుకు బార్ అసోసియేషన్లో పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించటం జరిగింది. చదువుల తల్లి భారతదేశ మొట్ట మొదటి మహిళా టీచర్ సావిత్రి బాయ్ ఫూలే 191వ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను జనవరి 3వ తేదీని మహిళా టీచర్స్ డే గా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అనుకుల రమేష్, జనసేన లీగల్ సెల్ అడ్వకేట్ కసాని వెంకన్న బాబు మరియు షేక్ బాజీ, జనార్ధన్, బిజెపి నాయకులు చంద్రమౌళి, చింతా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.