కౌలు రైతు భరోసా యాత్రకు యూకే ఎన్ఆర్ఐ జనసైనికులు 2.58 లక్షల విరాళం
జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర కోసం యూకేకు చెందిన ఎన్ఆర్ఐ జనసైనికులు రూపాయలు.2.58 లక్షలు విరాళం అందచేశారు. సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలసి చెక్కును అందచేశారు. కౌలు రైతు భరోసా యాత్ర కోసం విరాళం ఇచ్చిన ప్రతి ఎన్ఆర్ఐ జనసైనికుడికీ అభినందనలు తెలిపారు.