పెనుగొండ గ్రామ సభలో పలు సమస్యలపై నిలదీసిన జనసేన

పెనుగొండ గ్రామ పంచాయితీ నందు గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెనుగొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు కంబాల బాబులు ఆధ్వర్యంలో పెనుగొండ జనసైనికులు గ్రామంలోని పలు సమస్యలు E.O.P.R.D ముందు లేవనెత్తారు, వీటిలో ముఖ్యంగా జనసేన గెలిచి వార్డులో కుళాయి టాప్ ను డమ్మి చేయడం, సుమారు 600 కొత్త గృహాలకి పన్ను ఇవ్వకపోవడం తద్వారా పంచాయితీకి ఆదాయం కోల్పోవడం, బెటర్మెంట్ కట్టిన ఇంటి స్థలాలకి హౌస్ ప్లాన్ ఇవ్వకపోవడం, గతంలో పంచాయితీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ విత్ డ్రా చేసిన వారికి డిపాజిట్ డబ్బులు ఇవ్వకపోవడంలాంటి అనేక సమస్యలపై జనసేన పార్టీ ప్రశ్నించడం జరిగింది. ఈ సమస్యలని వెంటనే పరిష్కరించాలిని పెనుగొండ జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ జనసేన పార్టీ వార్డు సభ్యులు చిట్నిడి రాము, కాకి ప్రభాకర్ మరియు జనసేన పార్టీ నాయకులు యర్రంశెట్టి బాబురావు, బళ్ళ మాధవ్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.