ఎట్టకేలకు పెన్షన్ ఇచ్చిన అధికారులు

సత్యవేడు నియోజకవర్గం B.N. కండ్రిగ మండలం వేణుగోపాలపురంకు చెందిన మునెయ్యకు ఆధార్ బయోమెట్రిక్ సమస్య వలన పెన్షన్ తొలగించడం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాషా, మండల నాయకులు కృష్ణ, హరి వారిని పరామర్శించి నెలకు సరిపడా వస్తువులు అందించి, సంబంధిత సచివాలయంకు తీసుకువెళ్లి అధికారులతో మాట్లాడటం జరిగింది, బయోమెట్రిక్ పడనందువలనే పెన్షన్ ఆగిపోయిందని అధికారులు చెప్పడంతో బాషా దగ్గర వుండి ఆధార్ బయోమెట్రిక్ చేయించి పెన్షన్ మంజూరు చేయించారు, ఆరు నెలలు తరువాత మునెయ్యకు 3000/-రూ. పెన్షన్ అధికారులు అందజేయడం జరిగింది, దీనికి వారి బంధువులు, గ్రామస్తులు జనసేన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.