దివీస్ కంపెనీలో ప్రమాదానికి గురైన వ్యక్తి కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన పేడాడ రామ్మోహన్
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-21-at-11.06.34-AM-2-1024x768.jpeg)
ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం తెలిగిపెంట గ్రామానికి చెందిన బురిడి శ్రీనివాస్ కొంత కాలంగా తగరపువలస దివీస్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తుండగా కొద్ది రోజుల క్రితం దివిస్ లో గ్యాస్ పేలడంతో ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుని ఆ కుటుంబ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని అన్ని విధాలుగా నేను మీకు అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-21-at-11.06.34-AM-1024x768.jpeg)