చల్లా సాయికుమార్ ను పరామర్శించిన జనసేన నాయకులు

ఖమ్మం: ఖమ్మం-ఇల్లందు రహదారి మార్గంలో పండితాపురం గ్రామ సమీపాన శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు ఢీకొట్టడంతో జాస్తిపల్లి గ్రామానికికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త చల్లా సాయికుమార్ గాయపడి, ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న జనసేన ఖమ్మం నగర కమిటీ ప్రధాన కార్యదర్శి యాసంనేని అజయ్ కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంత సత్యనారాయణ తీవ్ర గాయాల పాలైన సాయికుమార్ ని పరామర్శించడం జరిగినది.