పామర్రు నియోజకవర్గంలో మండల అధ్యక్షుల విస్తృత స్థాయి సమావేశం
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-31-at-6.12.27-PM-1024x768.jpeg)
జనసేన పార్టీ పామర్రు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మండల అధ్యక్షులు విస్తృత స్థాయి సమావేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులను నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేయబడింది. నరేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ రోజురోజుకీ అమర్ నియోజకవర్గంలో ముందుకు సాగుతుందని ప్రజల పక్షాన, ప్రతి విషయంలో నిలబడుతుందని ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ పార్టీని ముందుకు వెళుతుందని తెలిపారు. అతి త్వరలో మండలం కమిటీలు కూడా వేసి పార్టీని ఇంకా గ్రామస్థాయిలోకి చేరువ చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, పామర్రు నియోజకవర్గ ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్, యువ నాయకురాలు వారి పవిత్ర, కృష్ణా జిల్లా కార్యదర్శి కాకి ఝాన్సీ, కృష్ణా జిల్లా సమితి కార్యదర్శి అమ్మ రాజు లక్ష్మి, షరీఫ్, పేపర్లో ఎంపీటీసీ కూనపరెడ్డి సుబ్బారావు, ఐదు మండలాల కార్యకర్తలు మహిళా నాయకురాలు పాల్గొన్నారు.