ఉద్ధానం సమస్యపై లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం 9వ రోజు

ఇచ్చాపురం నియోజకవర్గం: ఉద్ధానం కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారం కొరకు ఇచ్ఛాపురం జనసేన తరుపున ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ 9వ రోజు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కవిటి మండలంలోని బి గొనప పుట్టుగ పంచాయితీ లోని తుంగాన పుట్టుగ, చెవిటి పుట్టుగ, కొర్రాయి పుట్టుగ, బెవర పుట్టుగ, బాలాజీ పుట్టుగ, పర్రి పుట్టుగ, బంజు పుట్టుగ, లొట్టు పుట్టుగ, తడక పుట్టుగ, గొనప పుట్టుగ గ్రామాల్లో ప్రతీ ఇంటికి వెళ్లి జనసైనికులు, వీరమహిళలు సంతకాలు సేకరించారు. ఆదివారం లక్ష సంతకాల సేకరణలో సుమారు 1800 సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బైపల్లి ఈశ్వర్ రావు, మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, కంచిలి మండల అధ్యక్షులు డొక్కరి ఈశ్వర్ రావు, మున్సపాలిటీ వార్డ్ ఇంఛార్జి రోకళ్ళ భాస్కర్, సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, వీరమహిళ శైలజ, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దుగాన దివాకర్, బడగల రామకృష్ణ, లోళ్ళ సాగర్, మనోజ్, దేవా, భీమా రావు, రమణ, శివ, చందు, వల్లభ, సతీష్, రమణ మూర్తి, నవీన్ మరియు నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.