జనసైనికుడి కుటుంబానికి అండగా జనసేన

చింతలపూడి నియోజకవర్గం: లింగపాలెం మండలం, ధర్మాజిగూడెం గ్రామంలో జనసైనికుడు కలకోటి నాగ దుర్గా పేరాచారి మాతృమూర్తికి ఇటీవల హార్ట్ ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని ఆదివారం పరామర్శించి లింగపాలెం మండలం జనసేన నాయకుల సహకారంతో జనసేన పార్టీ తరపున 17000/- రూపాయలను చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకా ఈశ్వరయ్య, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి తూము విజయ్ కుమార్, కామవరపుకోట మండల అధ్యక్షుడు షేక్ వలీ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల అధ్యక్షుడు పంది మహేష్ బాబు, గౌరవ అధ్యక్షుడు మాదాసు కృష్ణ, మండల ఉపాధ్యక్షులు తాళం మల్లేశ్వరరావు, చల్లా నాగబాబు, ప్రధాన కార్యదర్శులు పూజారి సురేష్, మోదుగు అంజిబాబు, కార్యదర్శులు పుంజాల నరేంద్ర, పొదిల మహేష్, నాయకులు షేక్ షఫీ, బందెల సుధాకర్ పాల్గొన్నారు.