ములగుంటపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శికి జనసేన వినతిపత్రం

*జనం కోసం జనసేన

కొండేపి, జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం, ములగుంటపాడు గ్రామంలో ప్రజలు ఎదుకుంటున్న సమస్యలపై నాడు పర్యటించటం జరిగింది. శుక్రవారం ములగుంటపాడు గ్రామం సమస్యలపై సింగరాయకొండ మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ములగుంటపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీమతి శారద కి వినతిపత్రం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండలం అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, మండల నాయకులు కాసుల శ్రీనివాస్, ఆనుమల శెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాస్, పోలిశెట్టి విజయ్ కుమార్, షేక్ మబాష, సంకే నాగరాజు, కుమార్, షరీఫ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.