అగ్నిప్రమాదంలో నిరాశ్రయులైన జనసైనికుని కుటుంబానికి డి.ఎమ్.ఆర్ శేఖర్ ఆర్ధిక సాయం

అమలాపురం రూరల్ మండలం, సాకుర్రు గ్రామంలో జనసైనికుడు బొలిశెట్టి శివ ఇళ్ళు అగ్ని ప్రమాదంలో పూర్తిగా ఆహుతి అవడంతో శుక్రవారం అమలాపురం పార్లమెంట్ జనసేన పార్టీ ఇంఛార్జి డి.ఎమ్.ఆర్ శేఖర్ శుక్రవారం ఆ కుటుంబాన్ని పలకరించి తక్షణ సాయంగా జనసేన శ్రేణుల తరఫున 50 వేల రూపాయలను సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, సీనియర్ నాయకులు లింగోలు పండు, ఆర్.డి.యస్ ప్రసాద్, పోలిశెట్టి బాబులు, డాక్టర్స్ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగ మానస, అల్లాడ రవి, నల్లా వెంకటేశ్వర రావు, పోలిశెట్టి కన్నా, కంకిపాటి గోపి, మద్దింశెట్టి ప్రసాద్, చేట్ల మంగతాయారు, పాలూరి నారాయణ స్వామి, గంధం శ్రీను, నల్లా మూర్తి, సత్తిబాబు, రంకిరెడ్డి కృష్ణ, రంగాపురపు దొరబాబు, నిమ్మకాయల సాయి, పోలిశెట్టి మహేష్, పెదమల్లు మణికంఠ, యర్రంశెట్టి శాయి మరియు జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు.