కౌలు రైతు కుటుంబానికి జనసేన భరోసా

ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం కంభం గ్రామంలో తెలుగు వీధికి చెందిన కుంకుమ శేషవలి వ్యవసాయభూమి కౌలుకు తీసుకొని వ్యవసాయంలో పంట పండక నష్టం వచ్చి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పులు భారంతో వత్తిడికి గురయ్యి గుండెపోటుతో చనిపోయిన విషయం తెలుసుకొన్న జనసేన నాయకులు జనసేన పార్టీ ఇంచార్జీ బెల్లంకొండ సాయిబాబు కుటుంబ సభ్యులను కలసి వారికి నేను మీ పిల్లల చదువుకు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. కనీస అవసరాలకు 5000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా కార్యదర్శి లంకా నరసింహా రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాలరంగయ్య, కంభం మండల అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్, రంగనాయకులు, అప్పనబోయిన వెంకటయ్య, శ్రీపతి ప్రసాద్, షేక్ హాజ్మతుల్ల, షేక్ శుభాని, దందే నాగార్జున, ఈదర శివశంకర్, ఓబులేసు, సందు నారాయణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.