క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీని ప్రారంభించిన నాగ శ్రీను

వినుకొండ నియోజకవర్గం: స్థానిక వెల్లటూరు రూట్ హనుమాన్ నగర్ 12వ లైన్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో నందు క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం జనసేన పార్టీ వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొంజేటి నాగ శ్రీను రాయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగ శ్రీను మాట్లాడుతూ.. వినుకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం చేయించుకున్న ప్రతి ఒక్కరు మీకు క్రియాశీల సభ్యత్వం చేయించిన వాలెంటీర్స్ సంప్రదించండి. (లేదా) హనుమాన్ నగర్ 12 లైన్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నందు సంప్రదించగలరని తెలియజేసారు.