దాసరి రాజు ఆధ్వర్యంలో ధర్నా

ఇచ్చాపురం జనసేన ఇంచార్జి దాసరి రాజు ఆధ్వర్యంలో శనివారం ధర్నా కార్యక్రమం. ఇచ్చాపురం సిహెచ్సిలో డాక్టర్స్ కొరత, టెక్నిషియన్స్ కొరత అల్ట్రాస్కానింగ్ సిబ్బంది లేరు. రక్త పరీక్షలకు కెమికల్స్ లేవు. సిబ్బంది కొరత ఉంది. కలెక్టరు హాస్పిటల్ కి వచ్చి హాస్పిటల్స్ లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని జనసేన ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో చేయడం జరిగింది. వారంలోగా హాస్పిటల్ ని కలెక్టర్, డిసిహెచెస్ వచ్చి సమస్య పరిష్కరించవలెను లేనియడల రాస్తారోకో, రోడ్డుపై భైఠాయిస్తామని తెలియజేస్తున్నామన్నారు. వైద్యము కోసం బిల్ 1000 దాటితే ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పిన నాయకుల మాటలు ఏమయ్యాయి అన్నారు. చిన్నపిల్లల ఇంక్యుబ్లెటర్స్ నిరుపోయోగంగా పడిఉన్నాయ్. ఈ సమస్యలు వారంలోగా పరిష్కరించలేనియెడల తీవ్రమైన కార్యాచరణ సిద్ధం చేయబడును. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దుర్యోధన రెడ్డి, మత్యకర వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బేహారా, జడ్పీటీసీ అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు, జనసేన నాయకులు, వీరమహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.