మాకినీడి ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు జనసేన పార్టీ క్రియశిలక సభ్యత్వ నమోదు చేయించిన వాలంటీర్లను సత్కరించే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పిఠాపురం నియోజవర్గం, యు.కొత్తపల్లి లో ముపార్పు అచ్చమ్మ కళ్యాణమండపంలో.. పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి సమక్షంలో కొత్తపల్లి మండలాని కి చెందిన జనసేన పార్టీ క్రియశిలక వాలంటీర్లను శాలువాతో సన్మానించి వారికీ సభ్యత్వం కార్డులు, కిట్లను జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 10 11 12 తారీకున క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించి.. ఉప్పాడ కొత్తపల్లి మండలంలో 1450 సభ్యత్వాలు 10మంది వాలంటీర్లు చేయడం జరిగింది.. వీరిలో అత్యధికంగా 414 సభ్యత్వాలు చేయించిన తెలగశెట్టి వెంకటేశ్వరరావుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ.. వీరందరినీ పార్టీ తరఫున అభినందిస్తూ.. పవన్ కళ్యాణ్ గారు ప్రశంసా పత్రమును పార్టీ జెండాను పంపించడం జరిగింది. ఇవి అన్నీ కూడా వారికి అందజేసి చిరు సత్కారం చేయడం జరిగింది. అలాగే ప్రతి కార్యకర్త ని కుటుంబ సభ్యులుగా భావించి వారికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న మా అధ్యక్షులు కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ.. అలాగే ప్రతి క్రియాశీలక సభ్యులు పార్టీకి బలోపేతం దిశగా పని చేసి గ్రామస్థాయిలో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలియజేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో.. కొత్తపల్లి మండల అధ్యక్షులు పట్టా శివ, జనసేన గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అమరాది వల్లి రామకృష్ణ, పార్టీ నాయకులు మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు, మాజీ కౌన్సిలర్ వేణు నారాయణ రావు, కడారి తమ్మయ్య నాయుడు, దొడ్డి దుర్గాప్రసాద్, గాది గోపి, కోన రామకృష్ణ, నక్క శ్రీను, సూరడా శ్రీను, మేడిశెట్టి కామేష్, కర్రీ వెంకటరమణ, మైన పిల్లి రాజు, పుణ్య మంతుల మూర్తి, గోపు సురేష్, ముమసని సురేంద్ర, ప్రతాప్, పులి శివారెడ్డి, ఎజ్జు దొరబాబు, జ్యోతుల సందీప్, మణికంఠ, గంగిరెడ్ల సూరిబాబు, యండ్రపు శ్రీనివాస్, వాసంశెట్టి రాజు, గున్నా బత్తుల రాంబాబు, వినుకొండ అమ్మజి, గొల్లపల్లి గంగ, రవి, మేళం బాబి, మండల నాయకులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.