జనసేన – గిరిసేన 43వ రోజు

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలంలో విస్తృత పర్యటన చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా బి.పి.నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం లో ఈనెల 12 వ తేదిన జరగబోయే భారీ బహిరంగ సభ యువశక్తి (మన యువత – మన భవిత) కార్యక్రమం ప్రచారంలో భాగంగా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయటం కోసం వాల్ పోస్టర్లు, ఆటో స్టికర్ లను విడుదల చేశారు. కనుక ప్రతి ఒక్క జనసైనికులు వివిధ గ్రామాల్లో పర్యటించి విస్తృత ప్రచారం మొదలుపెట్టాలి అని జనసేన జానీ తెలియజేయడం జరిగింది. మత్స పుండరీకం, జనసేన జాని లు మాట్లాడుతూ యువశక్తి భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యులు, జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, యువతీయువకులు తప్పకుండా పాల్గొననవలసినదిగా కోరుతున్నాము. 2024 లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అంటే పాలకొండ నియోజకవర్గం లో యంయల్ఏ గా గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కష్టపడాలి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రమోద, శీల చిన్ని, చింత గోవర్ధన్ నాయుడు, మత్స సత్యనారాయణ, ఉంగటి శ్రీనివాస్, వావిలపల్లి నాగభూషన్, దండేల సతీష్ తదితరులు పాల్గొన్నారు.