చెల్లూరులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు కిట్లపంపిణీ..
రాయవరం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మండపేట నియోజకవర్గం ఇంచార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ నేతృత్వంలో.. రాయవరం మండలం, చెల్లూరు గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తల ప్రమాద భీమా కిట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న సభ్యులకు, ప్రమాద భీమా ధృవీకరణ పత్రంతో కూడిన, సభ్యత్వ కిట్స్ ను చెల్లూరు గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యుడు ఇంటి ఇంటికి తీసుకెళ్లి సభ్యత్వ కిట్లను అందజేసి.. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేసి.. పార్టీని మండపేట నియోజకవర్గంలో మరింత బలపరచాలని కోరారు. జనసేన పార్టీ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-14-at-7.57.10-PM-1024x768.jpeg)