ఉమ్మడి కృష్ణాజిల్లా లో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉమ్మడి కృష్ణాజిల్లా: అధినేత పవన్ కళ్యాణ్ అదేశాల మేరకు.. జిల్లా అధ్యక్షులు బంద్రెడ్డి రామకృష్ణ సూచనల మేరకు ఉమ్మడి కృష్ణాజిల్లా, నూజివీడు టౌన్, రూరల్, ముసునూరు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో నూజివీడు పట్టణము జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మరియు క్రియాశీలక కార్యకర్తల ప్రమాద భీమా కిట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. నూజివీడు టౌన్, మండల జనసేన పార్టీ అధ్యక్షులు యర్రంశెట్టి రాము, అబ్బూరి రవి కిరణ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ.. కార్యకర్తలకు కష్టం వస్తే అండగా ఉండే పార్టీ జనసేన పార్టీ మాత్రమే అన్నారు. వైయస్సార్సీపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు మీద, అక్రమాల మీద పోరాటలు చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లో అత్యధికంగా 259 సభ్యత్వాలు చేసిన నూజివీడు నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు తో పాటు వాలంటీర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి రెడ్డి మణి, జిల్లా అధికార ప్రతినిధి మారీదు శివరామకృష్ణ, జిల్లా కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులు ఉమమహేశ్వరావు, మండల ఉపాధ్యక్షులు, తోమ్మండ్రు అశోక్, ఇంటూరి చంటి, నియోజకవర్గ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్ బొబ్బిలి శ్రీకాంత్, ఏనుగుల చక్రి, లాయర్ రామిశెట్టి సత్యనారాయణ, యాదల వెంకట్, తోట బలరాం, రాంప్రసాద్, సాయి, జగదీష్, కోటి, శివ, మస్తాన్ వలీ, నాగుర్ భాష, సంతోష్, నియోజకవర్గ వీర మహిళలు రామిశెట్టి తేజస్విని, ఉమ మహేశ్వరి, లక్ష్మి మరియు మండల నాయకులు భారీ ఎత్తున జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.