కొవ్వాడలో పర్యటించిన శ్రీమతి కాంతిశ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కొవ్వాడ గ్రామ జనసైనికులు ఇటీవల ఎచ్చెర్ల నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో.. నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ ని కలిసి ఆ గ్రామంలో సమస్యలు వివరించడం జరిగింది. ఈ క్రమంలో గురువారం కాంతిశ్రీ ఆ గ్రామ సమస్యలను పూర్తి స్థాయిలో తెలుసుకొనే దిశగా కొవ్వాడ పర్యటన చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారని.. ఆ గ్రామ పెద్దలకు, జనసైనికులకు ప్రజలందరి సమక్షంలో ఒక త్రాగునీటి బోరును కొవ్వాడ పంచాయతీకి జనసేన పార్టీ తరఫున, నా తరఫున వేయడం జరుగుతుందని శ్రీమతి కాంతిశ్రీ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసాద్, లక్ష్మణ్, వెంకి, లావేరు మండల నాయకులు రాజేష్, బాబాజీ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.