మండపేట నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం..

*ముఖ్య అధితిగా జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్..

మండపేట:- ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే కౌలు రైతు భరోసా యాత్రకు సంబంధించన ఏర్పాట్లుపై రేపు అనగా గురువారం సాయంత్రం 4గంటలకు బాబు & బాబు కన్వెన్షన్ హాలు నందు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అధితిగా జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొంటారు. కావున ఈ సమావేశంలో నియోజకవర్గ క్రియాశీలక సభ్యులు, జనసైనికులు, అభిమానులు, వీరమహిళలు అందరూ తప్పక హాజరు కావాల్సిందిగా వేగుళ్ల లీలా కృష్ణ తెలియజేసారు.