జనసైనికుడు వీరబాబు కుటుంబానికి జనసేన అండ

గతంలో కోవిడ్ తో మృతి చెందిన రంగాపురానికి చెందిన జనసైనికుడు సమనస వీరబాబు కుటుంబానికి ఆనాడు జనసేన పార్టీ తరపున ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. మృతి చెందిన జన సైనికునికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె చదువు నిమిత్తం మాజీ మున్సిపల్ చైర్మన్ జనసేన పార్టీ నాయకులు యాళ్ళ నాగ సతీష్ ప్రతి సంవత్సరం 5 వేల రూపాయలు అందజేస్తామని తెలియజేశారు. అందులో భాగంగా శనివారం ఆ కుమార్తె చదువు నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5 వేల రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, నాయకులు నల్లా వెంకటేశ్వరావు, గంధం శ్రీను, పిల్లా రవి, మండేలా గోపి, ఏడిద పళ్లంరాజు, పోలిశెట్టి దుర్గా ప్రసాద్ యూ.డీ.పీ తదితరులు పాల్గొన్నారు.