తోకలపల్లి గ్రామంలో త్రాగు నీరు సరఫరా చేసిన జనసేన

ఉంగుటూరు, నిడమర్రు మండలం కొల్లేరు ప్రాంతం అయిన తోకలపల్లి గ్రామంలో ప్రజలు త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని జనసైనికులు తెలుపగా వెంటనే స్పందించి శుక్రవారం, శ్రీ లక్ష్మి నారాయణ పౌండేషన్ ట్యాంకర్ ద్వారా ప్రతి ఇంటికి త్రాగు నీరును సరఫరా చేసిన జనసేన పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ ఇంచార్జ్ పత్సమట్ల ధర్మరాజు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.