దెందులూరులో ఘనంగా జనసేన అధినేత జన్మదిన వేడుకలు

దెందులూరు నియోజకవర్గం, పెదవేగి మండలంలోని విజయరాయి గ్రామంలో దివ్యాంగుడు రోజూ ఉదయం వార్తా పత్రికలు వేస్తూ జీవనం సాగిస్తున్నారని, కానీ సరైన వాహనం లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని జనసేన ధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుక పురస్కరించుకుని ఈ సందర్భంగా 35 వేల రూపాయల విలువ కలిగిన బ్యాటరీతో నడిచే త్రిచక్ర వాహనాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్ బహుకరించడం జరిగింది. అనంతరం దెందులూరు మండలంలోని తిమ్మనగూడెం గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా స్థానిక జనసైనికులతో కలిసి మెట్టపల్లి మధు ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో పాల్గొని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్ విద్యార్ధులకు పుస్తకాలు, పెన్నులు బహుకరించి మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పెదపాడు మండలంలోని ఏపూరు గ్రామంలో ఆటో తిరగబడి గాయాలపాలై జీవనోపాధి కోల్పోయిన వ్యక్తిని పరామర్శించి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సదరు వ్యక్తికి బియ్యం, నిత్యావసర సరుకులు ఇచ్చి, అధైర్యపడాల్సిన అవసరం లేదని తాను జనసైనికులు ఆ కుటుంబానికి అండగా ఉంటారని వైద్యానికి అయ్యే ఖర్చులకు సైతం ఎంత మాత్రం వెనుకాడద్దని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్ భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.