వచ్చే పుట్టినరోజు నాటికి పవనే సిఎం: వేగుళ్ళ లీలా కృష్ణ

  • విజయం మనదే…
  • జనసేన గెలుపు తధ్యం…
  • ముందుగానే ఎన్నికలు..
  • వచ్చే పుట్టినరోజు నాటికి పవనే సిఎం…

మండపేట: వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం ఖాయమని జనసేన మండపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా
పట్టణ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు మామిడాల మనో కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక కాపుకళ్యాణ్ మండపంలో శుక్రవారం మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలా కృష్ణ ప్రారంభించారు. కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ 2023 లోనే ఏ పి ఎన్నికలు నిర్వహిస్తారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జన సేన ప్రభంజనం విస్తోందని సర్వేలు తేటతెల్లం చేస్తున్న నేపథ్యంలో తాను మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలుపొంది వచ్చే ఏడాది పవన్ పుట్టినరోజుకు తన ఎమ్మెల్యే పదవి కానుకగా అధినేత పవన్ కు అంకితం ఇస్తానని ధీమా వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యం గా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. అక్టోబర్ 5 విజయదశమి నుండి నియోజకవర్గంలో గ్రామ గ్రామ న పర్యటించి సమస్యలపై గళమెత్తు తామని పేర్కొన్నారు. వచ్చే పుట్టినరోజు నాటికి ఎన్నికలు ముందుగా నే వచ్చేస్తాయని జోస్యం చెప్పారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గా తాను ఎన్నికై పవన్ కు పుట్టినరోజు కానుక గా తన విజయాన్ని అంకితమిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొమ్ముశెట్టి సూరిబాబు, సంయుక్త కార్యదర్శి దాలపర్తి శ్రీనివాస్, వల్లూరు సర్పంచ్ దాసి మీనా కుమారి, చెల్లూరు ఎంపీటిసి గొల్లపల్లి అనురాధ, పార్టీ నాయకులు కుంచె ప్రసాద్, కొంతం నాగేంద్ర ప్రసాద్, వల్లూరి సత్య ప్రసాద్, టంకాల చిన్ని, బసవరాజు, బొమ్మన సతీష్, సుంకర మణికంఠ, మొరం బాలాజీ, బండారు సతీష్, నిమ్మ రమేష్, కొనే గణేష్, వైజయంతి రాజు, పెడిమళ్ల సతీష్, ర్యాలీ బ్రమజి, గెడ్డపు కిరణ్, పొలమురి విజయ్, గంటి రాజు, పొలిశెట్టి గోపాల్, షేక్ రెహమాన్, కర్ర సాయి రామ్ రెడ్డి పవన్ కుమార్ లు తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో మొత్తం 251 మంది రక్తదానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *