దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై ప్రమాదం

దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిపై ఈ రోజు మధ్యాహ్నం రోడ్డుప్రమాదం ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పేలిపోవడంతో.. పల్టీలు కొట్టి బోల్తా పడింది. కారు బోల్తా పడగానే అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు స్పందించి కారులో చిక్కుకున్న వారిని బయటకు లాగారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. నడిరోడ్డుపై బోల్తా పడ్డ కారును ట్రాఫిక్ పోలీసులు పక్కకు నెట్టారు. మాదాపూర్ నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.