పెదకూరపాడులో “నా సేన కోసం… నా వంతు”

పెదకూరపాడు నియోజకవర్గంలో జిల్లా కమిటీ సభ్యులు యర్రంశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తలపెట్టిన “నా సేన కోసం… నా వంతు” కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాదె మాట్లాడుతూ… ఈరోజు జిల్లా కమిటీ, మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం జరగటం చాలా సంతోషకరమని తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మన పార్టీ తలపెట్టిన “నా సేన కోసం..నా వంతు” కార్యక్రమం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని మండల, గ్రామ అధ్యక్షులదే ముఖ్యపాత్ర అని తెలిపారు. మన పార్టీ అధ్యక్షులు వారు ఏ కార్యక్రమం తలపెట్టిన మనమందరం కలిసి ఆ కార్యక్రమాన్ని జనాల్లోకి చొచ్చుకుపోయే విధంగా తీసుకువెళ్లే బాధ్యత మనందరిదీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలని, రాష్ట్రంలోనే మన జిల్లా ఒక ప్రత్యేకత స్థానం, ముందు వరుసలో ఉంచాలి అని ఆశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లిక, నారదాసు రామచంద్ర ప్రసాద్, కొర్రపాటి నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు మట్టం వీరభద్రరావు, వాకా అఖిల్, కడియం శివ నాగేశ్వరరావు, సాకమురి శ్రీనివాసరావు, బిల్లురీ సురేష్ మరియు నియోజకవర్గ, సిటీ, మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.