మినీ డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ కావాలి: తోట ఓబులేసు

శింగనమల, దాదాపు పది లక్షలకు పైగా టెట్ క్వాలిఫై అయిన నిరుద్యోగులు ఉండి డీఎస్సీ కోసం వెయిట్ చేస్తూ, ప్రస్తుతం 35వేల పోస్టులు ఖాళీగా ఉండి కూడా కేవలం 6100 పోస్టులు మాత్రమే ప్రకటించడం చాలా బాధాకరం. నిరుద్యోగులను కేవలం ఓటర్లుగా మాత్రమే వాడుకున్న ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఏనాడు వారి సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న నిరుద్యోగులు అందరూ వయసు మీద పడుతున్నా ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ బ్రతకలేక కూలిపని చేసుకుని బ్రతుకుతున్నారు. రాబోయే రోజుల్లో జనసేన – తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యకి పరిష్కారం చూపుతుందని, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పరిపాలన ఉంటుందని శింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు తెలియజేశారు.