అనారోగ్యంతో బాధపడుతున్న సత్యానంతలక్షికి బత్తుల దంపతులు ఆర్థిక సహాయం
రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నరసాపురం గ్రామ వాస్తవ్యులు గొల్లవెల్లి సత్యనారాయణ సతీమణి సత్యానంతలక్షి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న బత్తుల దంపతులు ఆమెను పరామర్శించి సేవా దృక్పథంతో 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. మరలా నరసాపురం వచ్చి కలుస్తానని గొల్లవెల్లి సత్యనారాయణకి బత్తుల బలరామకృష్ణ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసాపురం గ్రామ కమిటీ ప్రెసిడెంట్ మట్టా నాగేశ్వరరావు, సదువు శ్రీను, బొజ్జప సత్యనారాయణ, అడ్డాల దుర్గ, ప్రగడ జోగారావు, ప్రగడ దుర్గ, వెలిసి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-18-at-8.16.11-PM-1024x768.jpeg)