డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్బంగా నివాళులర్పించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం, భారత అణు వైజ్ఞానిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి భారత క్షిపణుల పరిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు, మిస్సైల్ మాన్, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా పిఠాపురం పాత బస్టాండు నందు గల డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అబ్దుల్ కలాం పుట్టిన భారతదేశంలో నేను పుట్టడం గర్వకారణంగా ఉందని, భారతదేశం గర్వించితగ్గ వ్యక్తి ఒక పేపర్ బాయ్ గా నుంచి తన జీవితాన్ని మొదలుపెట్టి, దేశంలోనే ఒక అత్యున్నత మైన రాష్ట్రపతి స్థానాన్ని పొందిన మహనీయుడు మిస్సైల్ మాన్ అఫ్ ఇండియా శాటిలైట్ అండ్ రాకెట్ సైన్స్ కి ఎంతో కృషి చేసిన వ్యక్తి అమెరికా శాటిలైట్ కి కూడా చిక్కకుండా నిర్వహించిన అను పరీక్షలు విజయవంతం చేసిన మహనీయుడు అబ్దుల్ కలాం, దీని కారణంగా భారతదేశంపై యుద్ధం చేయాలంటే శత్రు దేశాలు భయపడే పరిస్థితికి తీసుకొచ్చిన మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. కలలు కనండి కలలు సాకారం చేసుకోండి అని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, బత్తిన వీరబాబు, జల్లూరు చక్రి, వాకపల్లి సూర్యప్రకాష్, కే చిన్ని, నిండి కొండ రాజేష్, బొంతు నాగు, డి సింహాచలం మరియు జనసైనికులు అధిక మొత్తంలో పాల్గొనడం జరిగింది.