పవన్ కళ్యాణ్ పై దాడికి యత్నిస్తే తర్వాత జరగబోవు పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: అజిత్ రెడ్డి

బనగానపల్లె, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై దాడికి ప్రయత్నించాలని చూస్తే ఊరుకునేది లేదని ప్రతిదాడికి కూడా జనసైనికులు సిద్ధంగా ఉన్నారని అవుకు మండల జనసేన పార్టీ నాయకులు అజిత్ రెడ్డి అన్నారు. అక్టోబర్ నెలలో జరిగిన వైజాగ్ పర్యటన తర్వాత నుండి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని అనుమానాస్పద వ్యక్తులు అనుసరిస్తూ అక్టోబర్ నెల 31 వ తారీకు హైదరాబాదులో గల పవన్ కళ్యాణ్ ఇంటి ముందర వాహనం ఆపి భద్రత సిబ్బందిపై గొడవపడి పవన్ కళ్యాణ్ పై దాడికి యత్నించిన దుండగులపై కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, నకిలీ నెంబర్ ప్లేట్లతో వాహనాలను పవన్ కళ్యాణ్ వెంట తిప్పుతూ దాడికి యత్నించాలని కుట్ర పన్నితే రాష్ట్ర మొత్తం జనసైనికుల ప్రతిదాడితో ఇబ్బంది వాతావరణం ఏర్పడుతుందని, కనుక రెచ్చగొట్టే పనులు చేయడం మానుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి ప్రజా సమస్యలపై మాత్రమే రాజకీయ పార్టీల పోరాటాలు ఉండాలని అలాకాకుండా ప్రశ్నిస్తే దాడికి దిగడం లాంటి చర్యలు చేస్తే ఎవరూ కూడా చూస్తూ ఊరుకోరని ఆయా పార్టీల నాయకులు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అజిత్ రెడ్డి, జనార్దన్, ఎం సి రామ్, ఏ వి ప్రసాద్, అల్లు చిన్న, శివరాముడు తదితరులు పాల్గొన్నారు.