జగనన్న ఇళ్ళు ప్రజలందరికీ కన్నీళ్లు
పలమనేరు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టిడ్కో ఇళ్ల సోషల్ ఆడిటింగ్ కార్యక్రమాన్ని పలమనేరు నియోజకవర్గం నాయకులు మరియు కార్యకర్తలు కలసి పలమనేరు పరిధిలో కురప్పల్లి కాలనీలో చేపట్టారు ఈ సందర్బంగా నాయకులు చిత్తూరు జిల్లా కార్యదర్శి పసుపులేటి దిలీప్ మాట్లాడుతూ పేదలందరికి ఇల్లు అన్నారు వారికి సరైన మౌళిక వసతులు లేకుండా మరియు అడవి ప్రాంతంలో ఇండ్లు ఇవ్వడం బాధాకరం 28 లక్షలు ఇళ్ళు కట్టిస్తామని చెప్పి 21 లక్షలకే పరిమితం చేశారు మిగిలిన 7 లక్షల ఇళ్ళు ఏమైట్లు ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి పసుపులేటి దిలీప్ కేంద్ర ప్రభూత్వం ప్రకటించిన 1260 కోట్లు ఏమైనట్లు అని ప్రశ్నించారు. అలాగే రారున్న రోజుల్లో మా పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రంలో నియోజకవర్గ నాయకులు రమేష్, రాజు, మోహన్, నందకుమార్, శ్రీనివాసులు, దేవరాజులు, సుధాకర్, బాబు, ప్రకాష్, జైసింహ, భువన్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-13-at-14.01.56-1024x576.jpeg)