జగనన్న ఇల్లు పేదలకు కన్నీరు

  • జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, లక్ష్మణరావు, రాందాస్, శ్రీరాములు.

అరకు నియోజకవర్గ కేంద్రంలో జనసేన పార్టీ మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా, కొన్నేడి లక్ష్మణరావు అల్లంగి రామకృష్ణ, బంగు రాందాస్, శ్రీరాములు తదితరుల ఆధ్వర్యంలో శనివారం సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జగనన్న మోసం దీంట్లో భాగంగా జగన్ అన్న ఇల్లు పేదలకు కన్నీరు అనే కార్యక్రమం అరకు వేలి మండలం చిన్నలబడు పంచాయతీ అట్ట గూడ గ్రామంలో మరియు పెదాలబడు పంచాయతీ శరభ గూడకాలనీ పంచాయతీ జనసేన బృందం సందర్శించి జగనన్న ఇల్లు బాధితులతో నిరసన కార్యక్రమం ప్లకార్డులతో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొన్నేడి చిన్నారావు, జల్లేడి సంతోష్, సంతోష్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.