యువత నైపుణ్యాన్ని ప్రోత్సాహించే మార్గంలో జనసేన

నెల్లిమర్ల: యువత ని ముందుకు తీసుకొని వెళ్ళాలని అనే ఆలోచన తో జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ నాయకురాలు లోకం మాధవి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఎస్ ఐ మరియు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఒకటి, వాళ్ళ లో క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సాహించే మార్గం లో క్రికెట్ టోర్నమెంట్ లు ప్రతి పంచాయతీ నుంచి యువత పాల్గోనేలాగా చేసి వారికి మంచి బహుమతులు ఇచ్చి యువత ని ప్రోత్సాహిస్తామని లోకం మాధవి తెలిపారు. కార్యక్రమం లో రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి కర్రి అప్పలరాజు, డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ మండల అధ్యక్షులు పతివాడ కృష్ణవేణి, వందనాల రమణ, జలపారి శివ, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కోఆర్డినేటర్ గుడివాడ జమ్మరాజు పార్టీ సీనియర్ నాయకులు పల్ల రాంబాబు, పైల శంకర్, గోవింద్, శిరుగుడి వెంకటేష్, పిడుగు జోగారావు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.