శెట్టూరు మండలంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో క్రియాశీలక సభ్యత్వం గురించి జన సైనికులకు వివరించి ఐదు లక్షల ఇన్సూరెన్స్ పాలసీని ప్రతి జనసైనికుడు ఖచ్చితంగా తీసుకోవాలని సూచించడం జరిగినది. మార్చి 14వ తేదీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ ఆవిర్భావ సమావేశానికి జనసైనికులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరడం జరిగినది. జనసేన సిద్ధాంతాలు నచ్చిన పలువురు యువతను కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగినది. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ శెట్టూరు మండల కన్వీనర్ లేపాక్షి ఈరన్న కళ్యాణదుర్గం మండల కన్వీనర్ షేక్ మొహిద్దీన్ , రామలింగ, ఎర్రిస్వామి, వెంకటేష్, నరసింహ, తిప్పేస్వామి, వీరేష్, కాంత రాజ్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగినది.